బెంగళూరు, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ): ప్రధాని మోదీని ఒక రౌడీషీటర్ కలవడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమైంది. మల్లికార్జున అలియాస్ ఫైటర్ రవి కర్ణాటకలో పేరుమోసిన గూండా. అతడిపై క్రికెట్ బెట్టింగ్, నగదు అక్రమ బదిలీ, భూముల కబ్జా కేసులు ఉన్నాయి.
గత నవంబరులో రవిని బీజేపీలో చేర్చుకున్నారు. అదివారం బెంగళూరు – మైసూరు పది లైన్ల మార్గాన్ని ప్రారంభించేందుకు మోదీ వచ్చినప్పుడు కొందరు నేతలతో పాటు రవి ఆయనకు స్వాగతం పలికారు. ఇద్దరూ నమస్కారం చేసుకున్నారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మండ్య జిల్లా నాగమంగళ నియోజక వర్గం నుంచి రవిని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నది.