న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఈడీ అధికారులకు వివరించానని, మరిన్ని రోజులు తన కస్టడీని పొడిగించాల్సిన అసవరం లేదని, పొడిగించడంలో అర్థం లేదని సంజయ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మరో పది రోజులపాటు కస్టడీని పొడిగించింది.
అయితే, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై ప్రివిలేజ్ మ్యాటర్స్ ఉల్లంఘనకు సంబంధించిన ఫైళ్లను సమర్పించాల్సిన అవసరం ఉన్నదని, అందుకు అనుమతించాలని సంజయ్ సింగ్ చేసిన వినతిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పార్లమెంట్ ప్రివిటేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు అనుమతించింది. అయితే ఆ సందర్భంగా తన సహచర ఎంపీలనుగానీ, మద్దతుదారులనుగానీ, మీడియా ప్రతినిధులనుగానీ కలిసేందుకు వీల్లేదని షరతులు విధించింది.
కాగా, ప్రివిలేజ్ మ్యాటర్స్ ఉల్లంఘనకు సంబంధించిన ఫైళ్లను 2023 అక్టోబర్ 5న తమ ముందు హాజరై సమర్పించాలని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ గతంలో సూచించింది. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్టోబర్ 4ననే సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. దాంతో ఆయన సంబంధిత ఫైళ్లను సమర్పించలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు అనుమతి కోరారు. కాగా, మనీ ల్యాండరింగ్ కేసులో బెయిల్ కోసం సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుగనుంది.
#WATCH | AAP MP Sanjay Singh was produced before Delhi’s Rouse Avenue Court today at the end of his judicial custody, in connection with the Excise policy money laundering case. pic.twitter.com/ckcWCqsvcn
— ANI (@ANI) December 11, 2023