న్యూఢిల్లీ : హరియాణాలోని నుహ్లో రోల్స్ రాయిస్ కారు (Rolls-Royce crash) ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మలూకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారణలో పాల్గొనాలని హరియాణ పోలీసులు నోటీసులో వికాస్ను కోరారు. ఈ ఘటనలో వికాస్ ప్రయాణిస్తున్న రోల్స్ రాయిస్ కారు ఢిల్లీ-ముంబై-బరోడా ఎక్స్ప్రెస్ హైవేపై మంగళవారం పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో వికాస్కు కూడా గాయాలయ్యాయి. వికాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే ఆయనను ప్రశ్నిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం వికాస్ గురుగ్రాంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈనెల 22న జరిగిన ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్, అతడి అసిస్టెంట్ మరణించగా, రోల్స్రాయిస్లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు.
ఎక్స్ప్రెస్వేపై 14 వాహనాలతో కూడిన కాన్వాయ్ వెళుతుండగా అకస్మాత్తుగా రోల్స్ రాయిస్ మితిమీరిన వేగంతో ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో యూటర్న్ తీసుకుంటున్న ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం వాటిల్లింది.
Read More :