న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇవాళ బాంబు పేలుడు సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో స్పెషల్ సెల్ పోలీసులు ఓ డీఆర్డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. ప్రత్యర్థి లాయర్తో గొడవ ఉన్న నేపథ్యంలో ఆ శాస్త్రవేత్త పేలుడు కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. డిసెంబర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబర్ 102లో తక్కువ స్థాయి తీవ్రతతో పేలుడు జరిగింది. అయితే ఈ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి డీఆర్డీవో శాస్త్రవేత్త అని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. రెండు సార్లు అతను కనిపించాడని, ఒకసారి పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగుతో.. రెండవ సారి బ్యాగు లేకుండా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో లిటిగేషన్లో ఉన్న డీఆర్డీవో శాస్త్రవేత్త.. లాయర్ను చంపాలని ప్లాన్ వేసినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితుడిపై సదురు లాయర్ పది కేసులు నమోదు చేశాడని, అసహనానికి గురైన అతను ప్రతీకారంతో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది.