Road Accident | నాగాలాండ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెమీను జిల్లాలో వాహనాన్ని ఢీకొట్టి ఎస్యూవీ వాహనంలో కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 65 కిలోమీటర్ల దూరంలోని ‘కే స్టేషన్’ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. యూఎస్వీ వాహనం కొహిమా నుంచి మోకోక్చుంగ్ వైపు వెళ్తున్నంది.
ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు ఇటీవల నాగాలాండ్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు (NSSB) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్-3 ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో చేరేందుకు ముగ్గురు మహిళల పాయింట్మెంట్ లైటర్లు సైతం తీసుకున్నారు. క్రమంలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.