చెన్నై, జనవరి 24: తమిళనాడు ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు ట్రక్కులు.. రెండు కార్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి. కారు రెండు ముక్కలై.. వంతెనపై నుంచి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు.
మూడు వాహనాలకు నిప్పు అంటుకొని దగ్ధమయ్యాయి. కృష్ణగిరి నుంచి సేలం వెళ్తున్న ఓ ట్రక్ వేగంగా దూసుకొచ్చి వంతెనపై మరో ట్రక్క్ను ఢీకొనటం.. ఈ ఘోర ప్రమాదానికి దారితీసింది. దీంతో బెంగళూరు-సేలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.