లక్నో : ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాండిలా పోలీస్స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శాండిలా ప్రాంతంలోని లక్నో – హర్దోయ్ రహదారిపై ఘటన చోటు చేసుకున్నది. బైక్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత బసు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో పది మంది గాయపడ్డారు.
లక్నో-హర్దోయ్ రహదారిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ఈస్ట్ ఫ్యాక్టరీ సమీపంలో హర్దోయ్ వైపు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు.. లక్నో వైపు వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి, ఇద్దరు మహిళలు సహా చిన్నారి మృతి చెందారు. బస్సు సైతం అదుపు తప్పి బోల్తాపడగా.. పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్వాల్ భేణిమాధవ్ త్రిపాఠి పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.