Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్రంలో అధికారం చే జిక్కించుకోవాలంటే, 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మెజార్టీ స్థానాలు గెలుపొందడం అత్యంత కీలకం. గత రెండు ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యూపీదే కీలక పాత్ర. 2014 ఎన్నికల్లో కమలం పార్టీ ఇక్కడ 78 సీ ట్లలో పోటీ చేసి ఏకంగా 71 స్థానాలను గెలవ గా , 2019లో 62 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో సీట్లు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. మరోవై పు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించాలని భావిస్తున్న ఇండియా కూట మి.. యూపీలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలగా ఉంది. అయితే, పొత్తులను ఖరారు చేసుకోవడంలో, చిన్న పార్టీలను కలుపుకొనిపోవడంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) – కాంగ్రెస్ కూటమి విఫలమైంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలను బయటినుంచి చూసే వారికి బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలుగా కనిపిస్తాయి. కా నీ, క్షేత్రస్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే అనేక చిన్న పార్టీలకు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉంది. ఈ పార్టీల్లో ఒక్కో పార్టీకి ఒక్కో సామాజికవర్గంలో, ఒక్కో ప్రాంతంలో బలం ఉంది. ముఖ్యంగా దళిత, ఓబీసీ వర్గాల్లో చిన్న పార్టీలకు పట్టుంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలను కలుపుకుని వెళ్లిన స మాజ్వాదీ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో పిచ్డే(వెనుకబడిన వర్గా లు), దళిత్, అల్పసంఖ్యాక్(మైనారిటీలు)ల ను ఏకం చేసి ఆయా వర్గాల బలం ఉన్న చిన్న పార్టీలను కూడగట్టి కూటమి ఏర్పాటుచేసింది. అధికారంలోకి రాకపోయినప్పటికీ సీట్లు, ఓట్ల శాతం పెంచుకోవడంలో ఈ కూటమి విజయవంతమైంది. 2017లో కేవలం 21.82 శా తం ఓట్లతో 47 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఎస్పీ.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీ య లోక్దళ్(ఆర్ఎల్డీ), సుహల్దేవ్ భారతీ య సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ), జన్వాదీ సో షలిస్టు పార్టీ(ఇప్పుడు జన్ జన్వాదీ పార్టీ), అప్నాదళ్(కమెరావాదీ), మహాన్దళ్ వంటి చి న్న పార్టీలతో పొత్తు పెట్టుకొని 32 శాతం ఓ ట్లతో 111 సీట్లకు ఎగబాకింది. ఆర్ఎల్డీ 8, ఎస్బీఎస్పీ 6 సీట్లు గెలుచుకున్నాయి. చిన్న పార్టీలను కలుపుకుంటే మంచి ఫలితాలు సా ధించవచ్చని ఆ ఫలితాలు నిరూపించాయి.
ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చే నాటికి పరిస్థితు లు మారిపోయాయి. చిన్న పార్టీలన్నీ సమాజ్వాదీకి దూరమయ్యాయి. ప్రధానంగా జయం త్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ.. ఎస్పీకి గుడ్బై చెప్పి బీజేపీతో జట్టుకట్టుంది. పశ్చిమ యూపీలో బలంగా ఉన్న జాట్ సామాజికవర్గంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. ఇక, ఓంప్రకాశ్ రాజ్భర్ నేతృత్వంలోని ఎస్బీఎ స్పీ ఇప్పటికే బీజేపీతో పొ త్తులోకి వెళ్లిపోయింది. ఈ పార్టీకి పూర్వాంచల్ ప్రాంతంలో, రాజ్భర్ సామాజికవర్గంలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి సహా బలియా, ఘాజీపూర్, అజాంగఢ్ వంటి 12 లోక్సభ స్థానాల్లో రాజ్భర్లు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఎస్పీతో సీట్ల సర్దుబాటు కుదరక సంజయ్ చౌహాన్ నేతృత్వంలోని జన్ జన్వాదీ పార్టీ 30 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ఈ పార్టీకి చౌహాన్ సామాజికవర్గంలో బలం ఉంది. అ ప్నాదళ్(కే) ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకున్న ది. ఇక, కేశవ్దేవ్ మౌర్య నేతృత్వంలోని మహాన్దళ్కు ఓబీసీలోని యాదవేతర వర్గాల్లో ప ట్టుంది. అయితే, సీట్ల సర్దుబాటు కుదరనందు న ఈ పార్టీ కూడా ఎస్పీతో పొత్తుకు దూరమైం ది. కాకపోతే ఎస్పీ పోటీ చేస్తున్న సీట్లలో మా త్రం బయటి నుంచి మద్దతు ఇస్తామని, ఇదే సమయంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న సీట్లలో మాత్రం బీఎస్పీకి మద్దతు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. భీం ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖ ర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పా ర్టీ(ఏఎస్పీ – కాన్షిరాం)తోనూ ఎస్పీకి పొత్తు కుదరలేదు. దీంతో ఈ పార్టీ ఒంటరి పోరుకు దిగుతున్నది.
ఇలా చిన్న పార్టీలన్నింటినీ దూరం చేసుకొని కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు కు దుర్చుకున్నది సమాజ్వాదీ పార్టీ. దూరమైన పార్టీల్లో ప్రధానమైన ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ బీజేపీతో జట్టుకట్టడం ఎన్డీఏకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మత్య్సకార వర్గాల్లో పట్టున్న నిషాద్ పార్టీ, కుర్మీ సామాజికవర్గం మద్దతు ఎక్కువగా ఉన్న అప్నాదళ్(ఎస్) కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇ దే సమయంలో మిగతా చిన్న పార్టీలను కలుపుకొనిపోవడంలో విఫలమైన ఎస్పీ – కాంగ్రె స్ కూటమికి ఆయా పార్టీలకు మద్దతుగా ఉన్న సామాజికవర్గాల ఓట్లలో కోత పడవచ్చు. చి న్న పార్టీలను వదులుకోవడం ద్వారా సమాజ్వాదీ పార్టీ మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తున్నదని జన్ జన్వాదీ పార్టీ అధ్యక్షుడు సంజ య్ చౌహాన్ అంటున్నారు. చిన్న పార్టీలు 3 నుంచి 5 స్థానాలు డిమాండ్ చేస్తున్నాయని, అన్ని సీట్లు ఇవ్వలేకపోయామని ఎస్పీ అధికా ర ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.