పాట్నా, ఫిబ్రవరి 16: బీహార్ సీఎం నితీశ్కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఆర్జేడీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా లాలూ విలేకరులతో మాట్లాడుతూ ‘నితీశ్ రాక కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి’ అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై నితీశ్ పార్టీ జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్కుమార్ స్పందిస్తూ మళ్లీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు.