పట్నా: బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్గా మార్చారు. అందులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని వసతులను కల్పించారు. ఇక అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రులకు ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు.
‘నా అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్గా మార్చాను. అందులో మంచాలు, ఆక్సిజన్ సిలిండర్లు, స్టాండర్డ్ మెడిసిన్స్, రోగులు, వారి సహాయకులకు అవసరమైన ఆహార వసతులు కల్పించాను. అందువల్ల వైద్య నిపుణులు, ఇంకా మెరుగైన వైద వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని’ ట్వీట్ చేశారు. ఈ లేఖను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే, సీఎం నితీశ్ కుమార్కు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి