న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant ) ఇవాళ ఆ జట్టు తరపున వందో ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇవాళ జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ఆ జట్టు తలపడనున్నది. 26 ఏళ్ల పంత్ గాయం వల్ల గత ఏడాది ఐపీఎల్ మిస్ అయిన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ తో పాటు మరో ప్లేయర్ అమిత్ మిశ్రా కూడా ఢిల్లీ తరపున ఇప్పటి వరకు 99 మ్యాచ్లు ఆడాడు.
2021లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు పంత్. శ్రేయాస్ అయ్యర్కు గాయం కావడంతో ఆ రోల్ను పంత్ అందుకున్నాడు. ఢిల్లీ తరపున పంత్ 98 ఇన్నింగ్స్లో 2856 పరుగులు చేశాడు. ఆ ఫ్రాంచైజీ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా పంత్ నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు.
పంత్ తన కెరీర్లో 262 ఫోర్లు, 129 సిక్సర్లు బాదాడు. ఢిల్లీ తరపున సెంచరీ బౌండరీలు చేసిన క్రికెటర్గా పంత్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పంత్ ఇప్పటి వరకు 62 క్యాచ్లు పట్టాడు. 19 స్టంపింగ్స్ చేశాడు.
ఈ ఏడాది పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో పంత్ 13 బంతుల్లో 18 రన్స్ చేశా ఔటయ్యాడు. కెప్టెన్గా మళ్లీ పంత్ బాధ్యతలు స్వీకరించడంతో ఆ జట్టుకు కొత్త జోష్ వచ్చింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో అతను విజృంభించే అవకాశాలు ఉన్నాయి.