Haryana Nuh Violence | హరియాణా నూహ్ హింసాత్మక సంఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ బుధవారం స్పందించారు. హింసాత్మక ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మృతి చెందారని తెలిపారు. ఘటనలకు సంబంధించి 116 మందిని అరెస్టు చేశామని, మరో 90 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టానికి పరిహారం చెల్లిస్తామన్నారు. అయితే, హింసాత్మక సంఘటనలకు కారకులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఆస్తులకు నష్టం కలిగిన వారి నుంచే పరిహారం రాబడుతామని ప్రకటించారు. నూహ్ ప్రాంతంలో బాధితుల కోసం పథకం తెస్తున్నామన్నారు. హరియాణాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయని, మరో నాలుగు కంపెనీల కేంద్ర బలగాలను కోరినట్లు పేర్కొన్నారు. జంట హత్యల కేసులో చిక్కుకున్న బజరంగ్ దళ్కు చెందిన మోను మనేసర్ను పట్టుకునేందుకు వేట కొనసాగుతుందన్నారు.