న్యూఢిల్లీ: తమకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే హక్కు మేజర్లకు ఉందని, కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పెండ్లి చేసుకున్న ఓ జంట పోలీసు రక్షణ కోసం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది.
వీరిద్దరికీ రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. బంధువుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.