గాంధీనగర్, అక్టోబర్ 26: దేశంలోనే మొట్టమొదటి మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ మోడల్ ఎలక్ట్రిక్ కారును గుజరాత్కు చెందిన డాక్టర్ దంపతులు రిధం సేత్, పూజా సొంతం చేసుకున్నారు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఇది 857 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ చెబుతున్నది. అలాగే 15 నిమిషాలు చార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు చుట్టిరావొచ్చని వెల్లడించింది. ఈ కారు ధర రూ.1.55 కోట్లు.