న్యూఢిల్లీ, ఆగస్టు 24: కరోనా లాక్డౌన్ సమయంలో తన వద్ద పనిచేసే బీహార్ కూలీలను విమాన టికెట్లు కొనిచ్చి ఇంటికి పంపిన రైతు పప్పన్ గెహ్లాట్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఓ గుడి ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్లో ఉన్నది. కాగా, లాక్డౌన్ తర్వాత కూలీలను తిరిగి పనిలోకి తీసుకునేందుకు కూడా విమానం టికెట్లు కొని మరీ రప్పించారు గెహ్లాట్.