న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా పండించే వరి 2023-24లో అంతకు ముందు ఏడాది కన్నా 3.79 శాతం తగ్గుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2022-23లో 110.5 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, 2023-24లో 106.31 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, వర్షపాతంలో అసమానతల వల్ల ఉత్పత్తి తగ్గుతుందని వివరించింది. ఈ ఏడాది పెసర, కంది, సోయాబీన్, చెరకు ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్పింది.