న్యూఢిల్లీ: పర్యావరణ, ఆరోగ్య సహితమైన రాగి, మట్టి, ఇతర మెటీరియల్తో తయారైన వస్తువులపై ప్రస్తుతం ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నది. తాజాగా రైస్ బ్రాన్తో బాక్స్లు, ప్లేట్లు, గ్లాసులు కూడా తయారయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసిన సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి.. నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం మాని పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలని కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ రైస్ బ్రాన్తో తయారైన ఉత్పత్తులను వినియోగించాలన్నారు. ఇవి లీక్ కావని, చౌకగా లభిస్తాయని, పునర్వినియోగం చేయలేనివని తెలిపారు.