న్యూఢిల్లీ: వెయ్యి రూపాయాల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. 2వేల నోట్లను ఉపసంహరించిన నేపథ్యంలో.. ఆ వత్తిడిని తట్టుకునేందుకు వెయ్యి రూపాయాల నోట్లను ప్రవేశపెడుతారా అని ఆర్బీఐ గవర్నర్(RBI Governor)ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. రూ.1000 నోటును పున ప్రవేశపెట్టే ఆలోచన ఆర్బీఐ గవర్న్ స్పష్టం చేశారు. అది ఊహాజనితమని, తమ వద్ద అటువంటి ప్రతిపాదన లేదన్నారు.
2వేల నోట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తొలిసారి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సర్క్యేలేషన్లో ఉన్న కరెన్సీలో.. 2 వేల నోట్ల విలువ కేవలం 10.8 శాతం మాత్రమే అని, ఆ నోట్లను విత్డ్రా చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా స్వల్ప స్థాయిలో ప్రభావం ఉంటుందన్నారు.