న్యూఢిల్లీ: ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలంటూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు చేపట్టిన ధర్మాసనం రెండు వారాల్లోగా స్పందనను తెలియజేయాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జయ ఠాకూర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టం తక్షణమే అమలైతే త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని చెప్పారు.