కాన్పూర్ : ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు అద్భుతం చేశారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. ఐఐటీ కాన్పూర్లో శనివారం నిర్వహించిన పరీక్షలో విజయవంతమయ్యారు. ఏవియేషన్ అధికారుల అనుమతితో టెస్టింగ్ విమానం గాల్లోకి ఎగిరింది. 5 వేల అడుగులకు చేరుకున్న తర్వాత క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేలా రసాయనాలను చల్లారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిసింది. బుందేల్ఖండ్ లాంటి కరవు ప్రాంతాల్లో దీని ద్వారా వానలు కురిపించవచ్చని ప్రొఫెసర్ మణిందర్ అగర్వాల్ తెలిపారు.