న్యూఢిల్లీ: కేరళలోని కాసరగడ్లో ఇటీవల ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహించిన సమయంలో బీజేపీ పార్టీకి ఒక్కొక్క ఓటు అదనంగా పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఆ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ఖండించింది. మాక్ పోలింగ్లో ఎక్స్ట్రా ఓటు పోలైనట్లు వచ్చిన వార్తలు తప్పు అని సుప్రీంకోర్టుకు ఈసీ చెప్పింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల వెరిఫికేషన్ అంశంపై వేసిన పిటీషన్లపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది.
మాక్ పోలింగ్లో బీజేపీ ఎక్కువ ఓట్లు పోలైనట్లు వచ్చిన నివేదికలు తప్పు అని, జిల్లా కలెక్టర్ నుంచి ఆ వార్తలపై వివరణ తీసుకున్నామని,అవన్నీ తప్పుడు వార్తలు అని, దీనిపై పూర్తి రిపోర్టును కోర్టులో సమర్పించనున్నట్లు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ నితీశ్ కుమార్ తెలిపారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
కాసర్గడ్లో మాక్ పోలింగ్ సమయంలో కనీసం నాలుగు ఈవీఎంల్లో.. బీజేపీకి అనుకూలంగా ఓట్లుపడ్డాయని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. కాసర్గడ్లో సీపీఎం అభ్యర్థిగా ఎంవీ బాలకృష్ణణ్, బీజేపీ అభ్యర్థిగా ఎంఎల్ అశ్విని పోటీపడుతున్నారు.