న్యూఢిల్లీ, జూన్ 23: ప్రముఖ బాలల రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తిని బాల సాహిత్య పురస్కారం వరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రకటించారు.
సుధామూర్తి రాసిన ‘గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ రచనకు గానూ ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగు కేటగిరీలో డీకే చదువుల బాబు (బాల సాహిత్య పురస్కారం), జానీ తక్కెడశిల (యువ పురస్కారం) ఎంపికయ్యారు.