Lok Sabha Elections | న్యూఢిల్లీ : ఓటు వేసే ముందు గత కొన్నేండ్లలో మన దేశం పర్యావరణ పరిరక్షణలో చూపిన పనితీరును మదింపు చేయాలని దాదాపు 70 పర్యావరణ, ప్రజా సంఘాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ సంఘాలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘రాబోయే ఏండ్లలో పరిశుభ్రమైన గాలి, నీరు పొందడానికి యువతకు గల హక్కు గురించి ఆలోచించాలి.
వాతావరణ మార్పులు భారత్ను వేధిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందు ఈ అంశాలతోపాటు గత కొన్నేండ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? తగ్గాయా? వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం కొనసాగుతున్నాయా? లేదా? ఉద్యోగాల సృష్టి జరిగిందా? ప్రజల హక్కుల పరిస్థితి ఏమిటి? అనే అంశాలను కూడా పరిశీలించాలి’ అని ప్రకటన కోరింది.