Mukesh Ambani | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మర్యాదపూర్వకంగా కలిశారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), కాబోయే కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant)తో కలిసి షిండే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్ – రాధికల వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. కుటుంబ సమేతంగా కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ముకేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న జరుగనున్న విషయం తెలిసిందే. ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ‘జియో వరల్డ్ ప్లాజా’ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహ తంతు జులై 12న (శుక్రవారం) మొదలై.. జులై 14న (ఆదివారం) మంగళ ఉత్సవ్ (రిసెప్షన్)తో ముగియనుంది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ తారలు సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani along with his son Anant Ambani and Radhika Merchant met Maharashtra CM Eknath Shinde and extended the invitation for the wedding of Anant Ambani and Radhika Merchant, scheduled on July 12. pic.twitter.com/BpG0WVBjy3
— ANI (@ANI) June 26, 2024
Also Read..
SS Rajamouli: రాజమౌళి దంపతులు, షబానా అజ్మీలకు ఆస్కార్ అకాడమీ సభ్యత్వ ఆహ్వానం
Veldanda SI | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వెల్దండ ఎస్ఐ
North Korea: బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా