న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తమ మునుపటి నోటీసులు తిరస్కరణకు గురైనప్పటికీ వెరవకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కోరుతూ తాజా ప్రయత్నానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం పలు విపక్ష పార్టీల నాయకులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
అలాగే కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాది పార్టీ, డీఎంకే సహా వివిధ పార్టీలకు చెందిన కనీసం ఐదుగురు సీనియర్ ఎంపీలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు ప్రక్రియను ప్రారంభించేందుకు కొత్త నోటీస్ ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారు.