న్యూఢిల్లీ: ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైనికులకు సహాయక సిబ్బందిగా పని చేస్తున్న కొందరు భారతీయులు విముక్తి పొందారు. భారత్ డిమాండ్ మేరకు వీరిని విడుదల చేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చాలా మంది భారతీయులు రష్యన్ మిలిటరీలో సెక్యూరిటీ హెల్పర్స్గా పని చేస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైనికులతో కలిసి పోరాడే విధంగా భారతీయులను నిర్బంధిస్తున్నారు. తమను విడుదల చేయాలని వీరు కోరుతున్నారు.