రిషికేశ్: చార్ధామ్ లో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వరకు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవడం వల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ ఆపేసినట్లు అధికారులు తెలిపారు. హిమాలయాల్లో ఉన్న ఈ మూడు ఆలయాలకు రిజిస్ట్రేషన్ ఆపేశామని, ఆలయాల వద్ద ఆందోళనకర పరిస్థితుల్ని నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్ తెలిపారు. రిషికేశ్లో ఉన్న ఐఎస్బీటీ రిజిస్ట్రేషన్ ఆఫీసు దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసింది. కేవలం బద్రీనాథ్కు వెళ్లే యాత్రికుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.