Social Media | న్యూఢిల్లీ, డిసెంబర్ 17: సోషల్మీడియా వాడకం ఎంత తగ్గిస్తే.. మానసిక ఆరోగ్యానికి, చేస్తున్న ఉద్యోగానికి అంత మంచిదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సోషల్మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించుకుంటే ఉద్యోగంలో పనిపై ఏకాగ్రత పెరుగుతుందని, వృత్తిలో సంతృప్తి దక్కుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. జర్మన్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్, రూర్ వర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలోని అంశాల్ని ‘బిహేవియర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ జర్నల్ తాజాగా ప్రచురించింది.
దీని ప్రకారం, 166 మందిని ఎంపిక చేసుకొని.. వారిని రెండు గ్రూపులుగా పరిశోధకులు విడగొట్టారు. ఒక గ్రూప్ సోషల్మీడియా వాడకాన్ని 30 నిమిషాలు తగ్గించుకోగా, మరోగ్రూప్ తన సోషల్మీడియా హాబీని యథావిధిగా కొనసాగించింది. పరిశోధనకు ముందు.. తర్వాత వారి నుంచి వివిధ ప్రశ్నలపై సమాధానాలు సేకరించారు. సోషల్మీడియా వాడకం 30 నిమిషాలు తగ్గించుకున్న గ్రూప్లోనివారు.. తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, ఉద్యోగంలో సంతృప్తి ఉందని చెప్పారు.