న్యూఢిల్లీ, మే 24: ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ నిర్ణయంతో వంటనూనెల ధరలు తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.