న్యూఢిల్లీ: గతంలో పార్లమెంట్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని, లోపాలు లేని చట్టాలు రూపొందేవని సీజేఐ జస్టిస్ రమ ణ అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ సన్మాన సభలో సీజేఐ మాట్లాడారు. న్యాయవాది అయిన ధన్కర్ దేశ రెండో అత్యున్నత పదవికి చేరుకోవడం గొప్ప విషయమని చెప్పారు. స్వాతంత్య్రోద్యమంలో, రాజ్యాంగ రచనలో న్యాయవాదుల పాత్రను సీజేఐ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్లమెంట్ తొలినాళ్లలో సభలో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని, అందుకే లోపాలు లేని చట్టాలు రూపొందాయని పేర్కొన్నారు.