న్యూఢిల్లీ: యాసంగి సీజన్ పంటల సాగు కోసం రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని 20 శాతం మేరకు తగ్గించుకోవాలని రైతులను కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఆయన మంగళవారం ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలకు చెందిన 1,000 మంది రైతులతో వర్చువల్గా మాట్లాడారు. యూరియాను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.