పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు ఆ దేశ సైనికులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనను ఉద్ధృతం చేశారు. భూసేకరణను వెంటనే ఆపివేయాలని, భారీగా విధిస్తున్న పన్నులను, కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేశారు. గిల్గిత్-బాల్టిస్థాన్లో రోడ్డును దిగ్బంధించి అధికారులను అడ్డుకున్నారు.
స్కర్దు-కార్గిల్ రహదారిని తెరువాలని, సబ్సిడీలను పునరుద్ధరించాలని కోరారు.