చండీగఢ్, జూలై 5: ఇప్పటికే పంజాబ్, రాజస్థాన్లోని స్థానిక నాయకుల వర్గపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. హర్యానా కాంగ్రెస్లో ముసలం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా వర్గానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి. వేణుగోపాల్ను కలిశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల విషయంలో రాష్ట్ర అధ్యక్షురాలు కుమారి సెల్జా తమ వర్గం నేతలకే పదవులు కట్టబెడుతున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తమ సూచనలను పట్టించుకోవడం లేదని వేణుగోపాల్కు ఫిర్యాదు చేశారు.