రాయ్పూర్: అభివృద్ధి విషయంలో నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చత్తీస్ఘడ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ( Deputy CM Vijay Sharma) తెలిపారు. ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అని ఆయన అన్నారు. రాయ్పూర్లో మీడియాతో మాట్లాడుతూ.. నక్సల్స్తో వీడియో కాల్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని, వాళ్లు ప్రభుత్వం ముందుకు రాలేని పక్షంలో తాను వీడియో కాల్ చేసేందుకు రెఢీగా ఉన్నట్లు చెప్పారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో కారణం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వం నక్సల్స్ను వాడుకుందో వాళ్లే చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఆ రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా విజయ్ శర్మ వద్దే ఉన్నాయి. నక్సల్స్ గురించి ప్రశ్న వేసిన సమయంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్లు, బ్రిడ్జ్ల నిర్మాణాన్ని నక్సల్స్ వ్యతిరేకిస్తుంటారన్నారు. కానీ ఇటీవల రోడ్లు కావాలంటూ వాళ్లు కరపత్రాలను జారవిడిచారని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలోనూ స్కూళ్లను తెరువాలని తిరుగుబాటుదారులు ఓ లేఖను రిలీజ్ చేయాలని ఆయన కోరారు. అబుజామాద్, నారాయన్పూర్ అడవుల్లో ఉంటున్న యువతను కలిశానని, ముంబైకి వెళ్లి హీరోలు కావాలన్న ఆశ వారిలో ఉందని, కానీ తమ గ్రామంలో అభివృద్ధిని వాళ్లు ఆకాంక్షిస్తున్నారని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు.
#WATCH | Chhattisgarh Deputy CM Vijay Sharma says “Why are Naxalites not letting schools open in villages? People living in jungles in Narayanpur also want their villages to be developed…I will have a conversation with the Naxalites on video call if they can’t come in front and… pic.twitter.com/OtAn460sy5
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 17, 2024