గువహటి, సెప్టెంబర్ 6: ఆర్బీఐ పేరును ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్’గా మార్చాలని అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేరులో ఇండియా అన్నది బ్రిటిష్ వలసవాదంతో ముడిపడిన పదమని, దేశం ఇప్పుడు పునరుజ్జీవన దశకు చేరుకుందని అయన చెప్పుకొచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంనాటి అనేక పేర్లను అస్సాంలో మార్చామని గుర్తుచేశారు. బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన అనేక నిబంధనలు దేశంలో ఇప్పటికీ అమలువుతున్నాయని, వాటిని మార్చాల్సి ఉందని చెప్పారు.