న్యూఢిల్లీ, జూన్ 6: అంధులు కూడా సులువుగా గుర్తించేందుకు వీలుగా రూపొందించిన కొత్త నాణేలను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్లో రూపొందించిన 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలను ఆయన విడుదల చేశారు.
ఇవి స్మారక నాణేలు కాదని, చెలామణిలోకి తీసుకురానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, 12 కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ‘జన సమర్థ్’ పోర్టల్ను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ పథకాల పూర్తి వివరాలను ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.