RBI | ముంబై, జూన్ 25: రద్దు అయిన రూ.2,000 నోట్లలో 2/3 వంతు బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు చెలామణిలో ఉండగా.. వీటిలో 2.41 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు చేరాయి.
అంటే మొత్తం నోట్లలో 2/3వంతుకుపైగా తిరిగి వచ్చాయి’ అని తెలిపారు. రెండు వేల నోట్లను రద్దు చేసిన నెల రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయని పేర్కొన్నారు.