చెన్నై, జూలై 5: ఇద్దరు స్మగ్లర్లు జైలు పాలవ్వకుండా ఎలుకలు రక్షించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో చేటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి. దీంతో పట్టుబడ్డ సరుకు లేకపోవడంతో అరెస్ట్ చేసిన ఇద్దరిని కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది.
రాజగోపాల్, నాగేశ్వరరావు అనే ఇద్దరు మారీనా బీచ్లో గత ఏడాది గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిపై చార్జిషీటు దాఖలు చేశారు. అయితే కోర్టు విచారణలో గంజాయిని చూపించమని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ గంజాయంతా ఎలుకలు తినేశాయని చెప్పడంతో నిందితులకు శిక్ష వేయడానికి సాక్ష్యం లేకపోవడంతో న్యాయస్థానం వారిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.