న్యూఢిల్లీ: ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య రాపిడెక్స్ రైలు(RAPIDX rail)ను త్వరలో ప్రారంభించనున్నారు. రాపిడెక్స్ రైలు ఇండియాలోనే తొలి సెమీ హై స్పీడ్ రైలు కానున్నది. జూన్ మొదటి వారంలో ఈ రైలు ఆపరేషన్లోకి వస్తుంది. రాపిడెక్స్ రైలు కోసం ప్రస్తుతం షాహిదాబాద్, దుహాయి మధ్య 17 కిలోమీటర్ల లైన్కు మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఢిల్లీ – మీరట్ మధ్య సాహిదాబాద్, ఘజియాబాద్, గుల్దార్, దుహాయి, దుహయి డిపో స్టేషన్లు ఉంటాయి. ఆర్ఆర్టీఎస్ రూట్లో ఉన్న కొన్ని పెద్ద మెట్రో స్టేషన్లను కూడా కలుపుతున్నారు. రాపిడెక్స్ సిస్టమ్తో ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్టును కూడా లింక్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల ప్యాసింజెర్లు స్టేషన్ బయటకు రాకుండానే రైలు మారే వీలు ఉంటుంది.