Gujarat Court | అహ్మదాబాద్, డిసెంబర్ 18: అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. భారత్లో మహిళలపై లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించింది. మహిళల వెంటపడటం, వేధించడం, దుర్భాషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం, ఈవ్ టీజింగ్ లాంటి దుశ్చర్యలను శృంగారభరితమైనవిగా చూపుతూ సినిమాల ద్వారా ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని పేర్కొన్నది.
డబ్బు కోసం అశ్లీల వెబ్సైట్లలో వీడియోలను పోస్టు చేసేందుకు కోడలి పట్ల క్రూరంగా వ్యవహరించడం, బెదిరింపులకు గురిచేయడంతోపాటు భర్త, కుమారుడితో ఆమెపై అత్యాచారం జరిపించి నగ్నంగా చిత్రీకరించినందుకు అరెస్టయిన ఓ మహిళకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ దివ్యేశ్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.