మంగళూరు: మైనర్ అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడిన లింగాయత్ మఠ పెద్ద(Lingayat Seer) శివమూర్తి మురుగ శరణారు.. ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చిత్రదుర్గ జిల్లా జైలులో ఆయన 14 నెలలు జైలుశిక్ష అనుభవించారు. మురుగ మఠం నడిపిస్తున్న రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్న మైనర్ అమ్మాయిలను రేప్ చేసినట్లు శివమూర్తి మురుగ శరణారుపై ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ 8వ తేదీన కర్నాటక హైకోర్టు శివమూర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరీ చేసింది. పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్లు, అట్రాసిటీ యాక్టు, జువెనైల్ జస్టిస్ యాక్టు కింద లింగాయత్ మతపెద్దపై కేసు నమోదు చేశారు. జస్టిస్ శ్రీనివాస్ హరీశ్ కుమార్ తన బెయిల్ తీర్పులో పాస్పోర్టు సరెండర్ చేయాలని శివమూర్తిని ఆదేశించారు. ఇద్దరి సాక్షుల సంతకాలు కోరారు.