బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కేసు దర్యాప్తులో భాగంగా గత వారం శివమొగ్గలో ఎన్ఐఏ దాడులు జరిపింది. ఓ మొబైల్ స్టోర్తో సహా ఇద్దరు అనుమానితుల ఇండ్లలో సోదాలు జరిపింది. మొబైల్ స్టోర్ ఉద్యోగులను విచారించగా బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్ పేరు బయటకు వచ్చిందని ఎన్ఐఏ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
బీజేపీ కార్యకర్త అరెస్ట్ కావటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకుడు దినేశ్ గుండూరావు ఎక్స్ వేదికగా బీజేపీని నిలదీశారు. మీ పార్టీ కార్యకర్త అరెస్ట్పై మీరేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పేలుళ్లలో బీజేపీ ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతున్నదని ఆయన అన్నారు. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.