న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ అప్పుడే తన పనిని ప్రారంభించింది. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారులు ఆదివారం జమిలి కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి పలు అంశాలను వివరించారు.
ఈ కమిటీపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, లెజిస్లేటివ్ కార్యదర్శి రీటా వశిష్ట పేర్కొన్నారు. కమిటీలోని 8 మంది సభ్యుల పేర్లను తీర్మానం ద్వారానే ఎందుకు ప్రకటించారని ప్రశ్నించగా.. తమ శాఖ గతంలో అనుసరించిన విధానాలనే ప్రభుత్వం పాటించిందని ఒక ఉన్నతాధికారి చెప్పారు.