న్యూఢిల్లీ : ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్నది. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు జూలై 21న జరుగనున్నాయి. కొత్తగా ఎన్నికైన అభ్యర్థి 25న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఈ నెల 23న ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలుకనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరుగనున్నది. కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంపీలు పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కార్యక్రమంలో సభ్యుల ప్రశంసాపత్రం, జ్ఞాపిక, ఎంపీల సంకంతో కూడిన పుస్తకాన్ని అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీడ్కోలు కార్యక్రమం అనంతరం లోక్సభ స్పీకర్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అయితే, అంతకు ముందు ఈ నెల 16న రాష్ట్రపతి భవన్లో కేంద్రమంత్రులు, గవర్నర్లకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. పదవీ విరమణ అనంతరం రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ను వీడి.. 12 జన్పథ్ రోడ్లోని తనకు కేటాయించిన భవనానికి వెళ్లనున్నారు. రాంనాథ్ కోవింద్కు కేటాయించిన భవనంలో ఇంతకు ముందు దివంగత కేంద్రమంత్రి రామ్విలాస్ పాశ్వాన్ ఉండేవారు.