న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన రైతు నేత రాకేశ్ టికాయిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన ఘాజీపూర్ వద్దకు చేరుకున్న టికాయిత్ను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ర్యాలీలో పాల్గొనవద్దని, తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ర్యాలీలో పాల్గొనకుండా వెనుదిరిగారు. అనంతరం టికాయిత్ ట్వీట్ చేస్తూ ‘ఢిల్లీ పోలీసులు కేంద్రం చెప్పినట్టు తల ఆడిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న నిరసన ర్యాలీలో పాల్గొనకుండా నన్ను అడ్డుకున్నారు. ఇలా అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు. మా గొంతును వినిపిస్తూనే ఉంటాం’ అని పేర్కొన్నారు.