Rakesh tikait | పంజాబ్లో ప్రధాని మోదీకి తలెత్తిన భద్రతా సమస్య, 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్ నడిరోడ్డుపై ఆగిపోవడంపై రైతు నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. అదంతా సానుభూతి కోసం చేస్తున్న స్టంట్ అంటూ విమర్శించారు. పంజాబ్ ప్రజల సానుభూతిని పొందడానికి, ఇలాంటి చౌకబారు విధానాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఓవైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ రెండు పక్షాలూ తమని తాము కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నాయని రాకేశ్ టికాయత్ విమర్శించారు.