రైతులందరూ తమ వ్యవసాయ పనులపై దృష్టి నిలపాలని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ కోరారు. శాంతియుతంగా ఉంటూ అందరూ తమ తమ పనుల్లో మునిగిపోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో నిరసన చేస్తున్న రైతులందరూ ఇళ్ల బాట పట్టారు. ఇందులో భాగంగా గాజీపూర్ సరిహద్దుల్లో ఉన్న రైతులు ఈ స్థలాన్ని ఖాళీ చేసి, ఇళ్లకు వెళ్తుతున్నారు. ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడారు. వాగా సరిహద్దు మొత్తం ఖాళీ అవడానికి వారం రోజులు కచ్చితంగా పడుతుందని అన్నారు.
తమకు కేంద్రంతో ఎలాంటి గొడవా లేదని స్పష్టం చేశారు. అయితే ఇచ్చిన మాటపై నిలబడకుంటే మాత్రం మరోసారి ఉద్యమం చేపట్టడం మాత్రం ఖాయమని, అందులో అనుమానాలే లేవని టికాయత్ తేల్చి చెప్పారు. జనవరి 15 న సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరగబోతోందని, ఈ లోగా హర్యానా ముఖ్యమంత్రితో సహా మరికొంత మంది ముఖ్యమంత్రులతో భేటీ అవుతామని ప్రకటించారు. అయితే యూపీ ఎన్నికల్లో ఎలాంటి విధానాన్ని అవలంబించాలన్న విషయంపై మాత్రం ఇతరులతోనూ చర్చిస్తామని టికాయత్ తెలిపారు.