న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యంగా పోరాడే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) అన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కేంద్ర ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్ ఆదివారం నిర్వహించిన మహా ర్యాలీకి హాజరైన సిబల్ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని, కాషాయ సర్కార్కు వ్యతిరేకంగా సమైక్య పోరు చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ రాబోయే రోజుల్లో తాను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తానని సిబల్ పేర్కొన్నారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు సాధించేలా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఆప్ నిర్వహించిన మహా ర్యాలీ వేదికగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. కేంద్ర ఆర్డినెన్స్ ఢిల్లీలో ప్రజాస్వామ్యానికి చోటు లేదని, ఎల్జీనే సర్వాధికారి అని తేల్చిచెబుతున్నదని మండిపడ్డారు.
తనకు సుప్రీంకోర్టు పట్ల విశ్వాసం లేదని ప్రధాని చెబుతున్నారని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో తొలిసారిగా ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని అహంకారపూరితంగా వ్యవహరించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరోస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Read More
PM Modi | ఓట్లేసి గెలిపించిన మాకు.. పప్పన్నం కూడా పెట్టలేవా మోదీ?.. దేశంలో కంది పప్పు కష్టాలు