న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన డిప్యూటీ చైర్మన్ కావడం వరుసగా ఇది మూడోసారి. ఆయన పేరును బీజేపీ సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరివంశ్ ఎన్నికను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ప్రకటించారు.
ఆయన ఎన్నికకు ముందే సమాజ్వాదీ పార్టీ, టీఎంసీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత ఎగువ సభ సభ్యుడిగా రాష్ట్రపతి ఆయనను నామినేట్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వరుసగా మూడోసారి ఎన్నికైన హరివంశ్ను ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అభినందించారు. కాగా, ఒక నామినేటెడ్ సభ్యుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కావడం ఇదే ప్రథమం.