న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు తట్టి ఆయనను ఆశ్చర్యపరిచారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద టీఎంసీ ఎంపీ సుదీప్ మీడియాతో మాట్లాడుతున్నారు. పెట్రోల్ ధరల పెరుగులపై కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు.
ఇంతలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అటు వైపు వచ్చారు. సుదీప్ వెనుక ఉండి సరదాగా ఆయన రెండు భుజాలను తన చేతులతో తట్టారు. దీంతో షాకైన సుదీప్ వెనక్కి తిరిగి చూశారు. రాజ్నాథ్ పనిగా గుర్తించి నవ్వుకున్నారు. దీంతో ‘మాట్లాడండి’ అంటూ రాజ్నాథ్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.